రెండు లక్షల పదివేల రూపాయల ఎల్ఓసి అందజేత


నవతెలంగాణ- చండూరు: స్థానిక మున్సిపల్ కేంద్రానికి చెందిన మహమ్మద్ నజీర్ కూతురు ఎదుగుదల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పాపను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చూపించగా వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పడంతో స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టి కి తీసుకురాగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి తెలియజేయగా వెంటనే స్పందించి రెండు లక్షల పదివేల రూపాయల ఎల్ఓసిని స్థానిక నాయకులు మహమ్మద్ నజీర్ కు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు రాజగోపాల్ రెడ్డి అండగా నిలుస్తానన్నారు  ఈ కార్యక్రమంలో చండూరు , జిల్లా నాయకులు దోటి సుజాతవెంకటేష్ యాదవ్, డా.కోడి శ్రీనివాసులు,మాజీ సర్పంచులు కోడి గిరిబాబు,కలిమికొండ జనార్దన్ , కో ఆప్షన్ ముజ్జు ,బీమానపల్లి శేఖర్ కారింగురామ్మూర్తి, కల్లెట్ల మరయ్య,బుతరాజు వేణు ,ఐతరాజు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love