లారీ బైకు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
లారీ బైకు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అక్కంపల్లి, నాతాళ్ల గూడెం గ్రామాల మధ్యన ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నార్కట్ పల్లి  మండలంలోని ఏ పి లింగోటంకు చెందిన శివకుమార్ వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెంలో తన బంధువుల ఇంటికి వచ్చి, తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో వలిగొండ నుండి ఎదురుగ వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న  ప్రయాణికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని,  వైద్యం నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు.
Spread the love