పంతంగి టోల్గేట్ వద్ద సంక్రాంతి రద్దీ

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ధర్మోజిగూడెం క్రాస్ రోడ్ నుండి పంతంగి టోల్ ప్లాజా వరకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వాహనాలతో శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కార్లతో విజయవాడ హైదరా బాద్ జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తో కార్లు నిలిచిపోయాయి.11వ తేదీ సాయంత్రం నుండి శనివారం రాత్రి వరకు 80 వేలల్లో కార్ల రాకపోకలు జరిగాయని చౌటుప్పల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ తెలిపారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రకు వెళ్లే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. దేవేందర్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో బస్టాండ్ ఏరియా తంగడపల్లి రోడ్డు వలిగొండ రోడ్డు వద్ద భారీ కేడ్లతో జాతీయ రహదారులను పోలీసులు మూసివేశారు. పట్టణ ప్రజలు తంగడపల్లి రోడ్డు నుంచి చిన్న కొండూరు వెళ్లాలంటే లక్కారం బ్రిడ్జి కింద నుంచి సర్వీస్ రోడ్డు గుండా చిన్న కొండూరు వెళ్లాల్సి వస్తుంది.బస్టాండు నుంచి నారాయణపురం పోవాలంటే వలిగొండ రోడ్డు నుంచి యు టర్న్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. బస్సుల రాకపోకలు జాతీయ రహదారిపై నుంచి హైదరాబాద్ కు ఇటు నల్లగొండకు వెళ్లిపోతున్నాయి.

Spread the love