భువనగిరి జిల్లా రవాణా కార్యాలయం పై ఏసీబీ దాడులు.. 

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా కార్యాలయంలో లంచం తీసుకుంటున్న జిల్లా అధికారి సురేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు  పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోచంపల్లి మండలం కప్రాయిపల్లి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేషనల్ ఫర్మీట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేయగా జిల్లా రవాణాశాఖ అధికారి 12 వేలు లంచం డిమాండ్ చేశారు. మరోసారి కలవగా 5000 ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో ఆయఅతను ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ ట్రాప్ లో భాగంగా  శుక్రవారం ప్రవీణ్ కుమార్ రూ. 5000  తీసుకొని జిల్లా రవాణా కార్యాలయానికి రాగా ఏజెంట్ సురేష్, అనిల్ అనే వ్యక్తులకు ఇవ్వాలని సూచించడంతో వాళ్లకు ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులను ఇద్దరు ఏజెంట్లు జిల్లా అధికారి సురేందర్ రెడ్డి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.  కార్యాలయంలోని నోట్లపై ఉన్న రంగు జిల్లా అధికారి సురేందర్ రెడ్డికి అంటుకున్నది వారు ముందస్తుగా ఇచ్చిన నగదుగా గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి  స్వాధీనం చేసుకున్న నగదు ఇదేనని నిర్ధారించారు.  పలు ఫైళ్లను పరిశీలించి సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కార్యాలయంతో పాటు సురేందర్ రెడ్డి నివాసం ఉంటున్న ఆయన ఇల్లు హైదరాబాదులోని హబ్సిగూడలో దాడులు చేస్తున్నట్లు ఏసిబి నల్గొండ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదు ఎసిబి కోర్టుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మల్లికార్జున్ అనే వ్యక్తి, సిబ్బంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా దాడులు జరగడంతో ప్రైవేట్ అనుమతి లేని ఏజెంట్లు ఒక్కసారి అక్కడ నుండి ఫలయానం అయ్యారు.   జిల్లా రవాణా కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న  లంచాల వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో పై ఏసీబీ అధికారులు దాడులు చేయడం అతన్ని ఏదో పట్టుకోవడం పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.
Spread the love