- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మామిడి రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా ఉన్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర రూ.1.10 లక్షలు పలికినా, ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.7 వేలకే పరిమితమైంది. బంగినపల్లి మామిడి ధర కూడా అప్పట్లో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.50-60 వేల మధ్య పడిపోయింది. హార్ముజ్ ప్రాంత ఉద్రిక్తతలతో ఎగుమతులు ఆగిపోవడం, డీజిల్ కొరత, హోటళ్లు మూతపడటం, వ్యాపారుల సిండికేట్ ప్రభావం వంటి కారణాలు ధర పతనానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
- Advertisement -



