బీఎస్పీ తాడ్వాయి మండల ఉపాధ్యక్షులుగా మర్క ప్రణయ్ గౌడ్ నియామకం…

నవతెలంగాణ -తాడ్వాయి 
తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన మర్క ప్రణయ్ గౌడ్ ను బీఎస్పీ ములుగు జిల్లా ఇంఛార్జి పసులాది ముఖేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మండల అధ్యక్షులు నద్దునూరి రాజా బాబు మండల ఉపాధ్యక్షుడిగా నియామక పత్రం అందజేశారు. మర్క ప్రణయ్ గౌడ్ మాట్లాడుతూ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదని కేవలం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేది బహుజన సమాజ్ పార్టీ అని జనాభా దామాషా ప్రకారం 60 నుంచి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అని విశ్వసించి, ప్రవీణ్ సార్ ద్వారానే బీసీలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇవ్వబడతాయని బీఎస్పీలో చేరడం జరిగింది అని చెప్పారు. నా నియమకానికి సహకరించిన బీఎస్పీ  ములుగు జిల్లా నాయకులకు, తాడ్వాయి మండల అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీలి జెండా విడువనని ప్రవీణ్ సార్ బాటలో ప్రయనిస్తనని మాట ఇస్తున్నాను అని మార్క ప్రణయ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి గజ్జల నవీన్, కార్యదర్శి జీడి గోపీచంద్,  కాటపుర్ ఆటో యూనియన్ అధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, కల్ల మహేష్ మంకిడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love