కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

నవతెలంగాణ- భిక్కనూర్ :
భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు ఆదివారం మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారం కోసం పాకులాడుతున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love