పేద ప్రజల పక్షాన పోరాడే జాహంగీర్ నే గెలిపించండి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూరు 
పేద ప్రజల పక్షాన పోరాడే ఎండి  జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం  చండూరు  మున్సిపాలిటీ పరిధిలో   ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన జహంగీర్ ను గెలిపించండి అని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టలు కొడుతూ నిధులకు   కోత పెట్టిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసేయాలని ఆలోచన వెనక్కి తీసుకొని పని దినాలు కూడా 200 రోజులు పెంచి, గిట్టుబాటు కూలిరేట్లను కట్టించి ఎండ తీవ్రతలకు తట్టుకునే టెంట్లను మంచినీళ్లు తదితర మౌలిక వసతులు కల్పించి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలన్నారు. మీ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపిస్తే, ఇలాంటి అనేక చట్టాలను తీసుకురావడానికి దోహదపడుతూ, పేద ప్రజల పక్షాన నిలబడే జహంగీర్ నుగెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, గౌసియా బేగం, కొత్తపెల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Spread the love