సమాచార హక్కు చట్టం పై అవగాహన

– సదస్సు విజవంతం చేయండి..
నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 28 న నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని వాసవి భవన్ లో సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు ను విజయవంతం చేయాలని సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక అధ్యక్షులు యరమాద కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాల లోని జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గల కమిటీల సభ్యులు ,మండలాల కమిటీల సభ్యులు, ఆయా కమిటీల బాధ్యులు,ప్రతి సభ్యుడు సమయానికి హాజరుకావలెనని తెలిపారు.సమాచార హక్కు వికాస సమితిలో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులు యారమాద కృష్ణారెడ్డి,నల్లగొండ జిల్లా ఆర్టిఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్, ఎస్ హెచ్ వీ ఎస్ రాష్ట్ర గౌరవ సలహా దారులు, శ్రీ కోటగిరి దైవదీనం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు, జిల్లాల ప్రథాన కార్యదర్శులు,జిల్లా కమిటీ ముఖ్యులు హాజరవు తున్నారని కావున ప్రతి సభ్యుదు తప్పని సరిగ్గా ఉదయం 10 గంటలవరకు హాజరు కావాలని తెలిపారు. మీరు రావడం తో పాటు నూతన సభ్యులు చేరడానికి ఆసక్తి వున్న వారిని తీసుకు రాగలరని కోరారు.

Spread the love