– తనిఖీ బృందానికి సహకరించిన దుద్దిళ్ల
నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నండి మంథని వెళుతున్న ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వాహనాన్ని పెద్దపల్లి జిల్లా సరిహద్దులో దుబ్బపల్లె చెక్ పోస్టు వద్ద మంత్రి వాహనాన్ని ఆపి పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు.ఇందుకు దుద్దిళ్ల అధికారుల బృందానికి పూర్తిగా సహకరించారు.