కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం కృషి చేయాలి

– మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని నాచారం,ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. మంథని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి,పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాజాద్దీన్, కుమ్మరి సది,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love