నేనూ కేసీఆర్ బాధితుడినే: ప్రభాకర్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్జీ ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని అన్నారు. గతంలో నల్గొండ ఎస్పీగా తప్పించారని, ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ 5 నెలలు ఆలస్యం చేశారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు చెప్పిన ప్రభాకర్ రావు.. జూన్ 26న రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు.

Spread the love