- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజ్యసభకు పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ వేసిన పిటిషన్ను ఆమోదించిన సుప్రీం కోర్టు, ఆమె వాదనలు వినడానికి అంగీకరించింది. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించకుండా అసంపూర్తి అఫిడవిట్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరించడం తప్పుడు నిర్ణయమని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
- Advertisement -



