- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
రబీ 2025-26 వరిధాన్య కొనుగోళ్ల విషయమై జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని, సరిపడా హమాలీలను నియమించి, దిగుమతులు వెంటనే జరిగేలా చూడాలని అన్నారు.
ప్రభుత్వం రబీ 2024-25 సిఎంఆర్ గడువు పొడిగిస్తూ, డెలివరీకి అనుమతించినందున, వెంటనే రబీ సీఎంఆర్ డెలివరీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి,పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు హరికృష్ణ, మిల్లర్లు పాల్గొన్నారు.
- Advertisement -



