నిధుల సమీకరణలో మెర్య్కూరీ ఇవి టెక్‌

Merykoori these are tech in fundraisingహైదరాబాద్‌ : విద్యుత్‌ వాహన రంగంలో మెర్య్కూరీ ఇవి టెక్‌ లిమిటెడ్‌ రూ.480 కోట్ల నిధులు సమీకరించనున్నట్లు వెల్లడించింది. కన్వర్టిబుల్‌ ఈక్విటీ వారెంట్లు లేదా ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఆ కంపెనీ ప్రకటించింది. దీనికి వాటాదారులు, ఇతర చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా 118.06 కోట్లు, కన్వర్టిబుల్‌ వారెంట్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.362.25 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు తెలిపింది.

Spread the love