కార్యకర్తలకు అండగా ఉంటా: మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ-పెద్దవంగర: పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన బచ్చు లచ్చయ్య ఇటీవల వృద్ధాప్యంతో మృతిచెందారు. బుధవారం బాధిత కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని పేర్కొన్నారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ సలిదండి మంజుల సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.
Spread the love