కాళేశ్వరం శివరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులు మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది, ప్రచారంలో భాగంగా వాల్ పోస్టర్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ. మారుతి, వేద పండితులు వైకుంఠపాండ, ముఖ్య అర్చకులు పనకంటి పనీంద్ర శర్మ, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Spread the love