నవతెలంగాణ కొమురంభీం: మంత్రి సీతక్క కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ఆదివారం భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో కొమురంభీం జిల్లాలోని కెరమెరి ఘాట్ వద్ద ఓ లారీ బురదలో ఇరుక్కుపోయింది. దీంతో కెరమెరి – జైనూర్ రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో మంత్రి సీతక్క సిర్పూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తుండగా.. కెరమెరి ఘాట్ వద్ద ఆమె కాన్వాయ్ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అనంతరం సీతక్క కాన్వాయ్ అక్కడి నుండి వెళ్లిపోయింది.