నవతెలంగాణ హైదరాబాద్: ‘ఐదేండ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు కాబట్ట… ఈసార్వత్రిక ఎన్నికలకు మేం దూరంగా ఉంటున్నాం అని ప్రకటించారు` మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామస్థులు. ‘ ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు.. తర్వాత మా వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకే ఈ లోక్సభ ఎన్నికలకు మేము దూరంగా ఉంటాం` అని మంగళవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామస్థులు మూకుమ్మడిగా తీర్మానించారు. ఇప్పటికీ తమ గ్రామానికి సరైన రహదారి లేక అత్యవసర వైద్యానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రయివేటు వాహనాలపై ఆధారపడుతున్నామన్నారు. ఇప్పటికైనా రాజారం నుంచి బబ్బెరుచెల్క వరకు, కావర్ కొత్తపల్లి నుంచి పార్పల్లి వరకు రహదారి మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.