నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కేఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. ఎన్నిలకు దూరంగా ఉన్న ఆమె.. రెండు స్థానాల్లో రాహుల్, శర్మ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి.. ప్రచారంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయ్బరేలీలో, అమేథిలో కేఎల్ శర్మ నామినేషన్ల చివరి రోజున అధికారులకు నామపత్రాలు అందజేశారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు లోక్సభ సీట్ల బాధ్యతలను ఆమెకు పార్టీ అప్పగించింది.