ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల

– ముదిరాజ్ ల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నగరంలోని ముదిరాజ్ కమ్యూనిటీ హల్ ల నిర్మాణానికి 1 కోటి 20 లక్షలు నిధులు మంజూరు 
– 50 లక్షల రూ.లతో ముదిరాజ్ ల కుల దైవం పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణం
– ముదిరాజ్ ల విజ్ఞప్తి మేరకు పెద్దమ్మ తల్లి ఆలయం కంపౌండ్ నిర్మాణానికి హామీ
– జెండా బాలాజీ ఆలయం చైర్మన్ గా జాలిగం గోపాల్ ముదిరాజ్
– రాజాకీయాల్లో వివిధ పదవుల్లో ముదిరాజ్ లకు చోటు
నవతెలంగాణ- కంఠేశ్వర్ :
ముదిరాజుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నగరంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో నిర్మాణానికి కోటి రూపాయల 20 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని 50 లక్షల రూపాయలతో ముదిరాజుల కుల దైవం పెద్దమ్మతల్లి ఆలయం నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని జండా బాలాజీ ఆలయం చైర్మన్గా జలిగం గోపాల్ ను నీ అమ్మకం జరిగిందని రాజకీయాల్లో వివిధ పదవుల్లో ముదిరాజులకు చోటు ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే  గణేష్ బిగాల  వినాయక్ నగర్ లోని విజయ లక్ష్మి గార్డెన్స్ లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. ముదిరాజ్ సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముదిరాజ్ ల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నగరం లోని ముదిరాజ్ సంఘాలకు కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసాము. 50 లక్షల రూ.ల తో నాగారం ప్రాంతంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నాము. నిజామాబాద్ నగరం లో ప్రతి కుల సంఘం భవనం నిర్మాణానికి నా ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసాను. అందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ అందరి సహకారంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి,  రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసాము. నగరం లోని ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్ లు ఇస్తాము.మంచి నీరు కావాలంటే ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. ప్రతి రోజు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నాము. యువతకు ఉపాధి కల్పించడం కోసం ఐటీ హాబ్ ని నిర్మించాము. పాలన సౌలభ్యం కొరకు నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించాము. అధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు నిర్మించాము. అంత్యక్రియల అనంతరం తదుపరి కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసాము. సంక్షేమం లో భాగంగా నిజామాబాద్ నగరం లో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాము. బీఆర్ఎస్  పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనె నిరుపేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద 3000 రూ.లని ఇస్తాము. 400 రూ.లకు వంట గ్యాస్ ని అందిస్తాము.మరోసారి ఆశీర్వదించండి పెద్దమ్మ తల్లి దీవెనలతో మరింత పట్టుదలతో పనిచేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, మాజీ కార్పొరేటర్ జాలిగం గోపాల్, శివ కుమార్, మాధవ్ రావు, యాదగిరి, మధుసుధన్, అనిల్, బాలరాజు, శ్రీనివాస్, రాజయ్య, కిషన్, హనుమాండ్లు, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love