దామరచర్లలో దోశలు వేసిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ – దామరచర్ల
నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి  గెలుపు కోసం మిర్యాలగూడ నియోజకవర్గం లోని దామరచర్ల మండల కేంద్రంలో తోపాటు జైత్రాం తండా గ్రామాల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామరచర్ల లోని ఒక టిఫిన్ బండి వద్ద స్వయంగా దోశ లో వేసి మరి ఓట్లు అడిగారు.ఈ  కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షుడు  శంకర్ నాయక్ తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love