జేఈఈ మెయిన్స్ లో 44వ ర్యాంకు సాధించిన విద్యార్థినికి ఎమ్మెల్సీ అభినందనలు

నవతెలంగాణ – హలియా
జాతీయస్థాయిలో మెయిన్స్ లో 44 ర్యాంకు సాధించిన చల్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన కోరేపాక శ్రీజని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యలో ఇంకా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పోటీ పరీక్షల్లో మన సత్తా చాటి ర్యాంకులను సాధించడం సాధారణ విషయం కాదని అందుకు ఎంతో పట్టుదల, శ్రద్ధ, అంతకు మించిన ప్రణాళిక కూడా ఉండాలి. అప్పుడే ర్యాంకు సాధించగలం. ఇటువంటి ఒక ప్రయాణమే ఈ విద్యార్థినిది అని అన్నారు.
Spread the love