- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని మోడీ రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వివిధ మార్గాలలో వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే మార్గాలను నివారించాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
- Advertisement -



