విజయభేరి యాత్రకు మోపాల్ నాయకులు

– విజయభేరి యాత్రకు మండలంలోని కార్యకర్తలు తరలిరావాలని: ముప్పగంగారెడ్డి
నవతెలంగాణ- మోపాల్: రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేపట్టిన విజయభేరి యాత్రకు మోపాల్ మండలంలోని కార్యకర్తలు అందరూ తరలిరావాలని కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకో రెండు నెలల్లో మన ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కర్షక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో విజయ బేరి యాత్ర సందర్భంగా చాలా రోజుల తర్వాత మన జిల్లాకి రాహుల్ గాంధీ  అడుగుపెడుతున్నారని వారికి అడుగడుగునా మనమందరం అండగా నిలవాలని అలాగే మనతోపాటు కార్యకర్తలే కాకుండా ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గం మీకు కానుకగా ఇస్తామని ఎలక్షన్ కంటే ముందే  మన జన సాంద్రతను చూసి ఈ నియోజకవర్గంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆయనకు నమ్మకం కలుగుతుందని, మళ్లీ 2004 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్ ని పునరావృతం చేసి తీరాలని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో,  జిల్లాకి పెద్ద దిక్కు అయినా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి  ఆధ్వర్యంలో అన్ని స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love