ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీ: మోతీరం నాయక్

నవతెలంగాణ – గాంధారి
ప్రజా రైతాంగ కార్మిక మహిళా వ్యతిరేకి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ షట్కర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి సీపీఐ(ఎం) ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గాంధారి మండల కేంద్రంలో బుక్లెట్ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. గత పది సంవత్సరం కాలంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలకు భారంగా మారిందని దోపిడీ దారుడుగా తయారైందని అన్నారు. ఈ దేశంలో 70 ఏళ్ల సంపాదనతో ఒక ఆదాని అంబానీకే కట్టబెట్టారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినారు. మణిపూర్ లాంటి ప్రాంతంలో మహిళలకు నగ్నంగా ఊరేగించారు. అత్రాస్ ప్రాంతంలో దళిత అమ్మాయిని రేప్ చేసి చంపేసి సవాన్ని కాల్చి బూడిద చేయడం జరిగింది. ఢిల్లీలో రైతులు 13 మాసాలపాటు నల్లచొట్ట మీద పోరాటం చేస్తే 1100 మంది రైతులు చనిపోవడం జరిగింది ఏ ఒక్కరి కూడా న్యాయం చేయలేదు. ఉన్న చట్టాన్ని దొడ్డి దారిన అమలు చేస్తా ఉన్నారు. ప్రజల ఉన్న సంపాదనత అడ్డగోలుగా దోపిడీకి చేయడం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ,ఉప్పు ,పప్పు నిత్యవసర ధరలను పెంచి ప్రజలను ఏమి కొనుగోలు చేయని స్థితిలో పెట్టడం జరిగింది. నువ్వు ఏం చేశావని ఈరోజు ఓట్లు అడుగుతున్నామని మేము ప్రశ్నిస్తున్నాము అందుకనే ప్రజావ్యతిరికి ప్రభుత్వాన్ని కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు సీపీఐ(ఎం) పార్టీ పిలుపునిస్తా ఉంది ప్రజలు గమనించాలి. మోడీని గద్దేదించాలని పిలుపునిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం లో మండల నాయకులు మధు, సరాప్ కిషన్ రావు, ప్రకాష్ నాయక్, బలరాం, సామ్యా నాయక్, గొల్ల సింగ్, బలరాం రైతుల కూలీలు పాల్గొన్నారు.
Spread the love