ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌజ్‌ అరెస్ట్

నవతెలంగాణ – అమరావతి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌజ్‌ అరెస్ట్ అయ్యారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు ఏపీ పోలీసులు. నేడు పుంగనూరు లో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైయ్యారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అయితే.. ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు.  వారం క్రితం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పుంగనూరు రాకుండా అడ్డుకున్నారు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. రెండు రోజుల క్రితం 13 పుంగనూరు కౌన్సిలర్లు సహా ఛైర్మన్‌ రాజీనామా చేసి చల్లా బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ తరుణంలోనే ఇవాళ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌజ్‌ అరెస్ట్ అయ్యారు. మిధున్ రెడ్డి హౌస్ అరెస్టు అయిన నేపధ్యంలో పుంగనూరులో వందలాది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Spread the love