అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన ఎంపీడీవో….

నవతెలంగాణ రెంజల్ 
రెంజల్ మండల కేంద్రంలోని శివాలయం వద్ద నున్న ఎంపీపీ ఎస్ పాఠశాల, గండిగుట్ట గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలను ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక కాంట్రాక్టర్లను ఆదేశించారు. పాఠశాలలు పునః ప్రారంభమై నందున వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తిగా గాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట వెండిగుట్ట కార్యదర్శి గౌతమి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love