నీటికొరత సమస్యకు పరిష్కారం చేసిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల పట్టణ కేంద్రంలోని హనుమాన్ నగర్ చర్చి ఆవరణలో 17వ వార్డులో మంచినీటి సౌకర్యం కొరకు ఏర్పాటు చేసి బోరుబావిని సోమవారం మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు ప్రారంభిం చారు.చైర్మన్ మాట్లాడుతూప్రజలు నీటి కొరతతో చాల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నది అని అన్నారు.17.వ వార్డు కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ జలదాతగా ముందుకు వచ్చి తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేయడం జరిగినది.ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చేసిన కౌన్సిలర్ లక్ష్మణ్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా ఇంకా దాతలు ముందుకు వచ్చి
నీటి కొరత సమస్య ఎక్కడైతే ఉంటుందో ఆయా వార్డులలో ప్రజలకు సహకరించి ఎవరైనా దాతలుగా ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ Md బాబా షరీఫ్,బండమీది మల్లేష్,వార్డ్ ఆఫీసర్ కాలినీ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love