పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి రూ.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాలని తాహాసిల్దార్ హరికృష్ణకు వినతి పత్రం సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా నిరుపేదలకు ఎక్కడ ఇళ్లస్థలాలు గాని ఇళ్ల నిర్మాణం గానీ చేపట్టలేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్,5 లక్షలు,ఇళ్ల స్థలాలు కట్టించి ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం చౌటుప్పల్ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి బొజ్జ బాలయ్య ఏం. సాలయ్య,మీసాల శ్రీను,యాట బాలరాజు,బోయ యాదయ్య తదితరులు ఉన్నారు.
Spread the love