Friday, May 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Muppaganga Reddy: నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్పగంగారెడ్డి

Muppaganga Reddy: నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్పగంగారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీల సమస్యలను కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి చోరవ చేస్తానని తెలిపారు. తనను చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీలను దేశంలోనే అగ్రగామి మార్కెట్ కమిటీలుగా తీర్చిదిద్దుతూ రైతులకు ఎల్లవేళలా సేవ చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -