Wednesday, May 13, 2026
E-PAPER
Homeక్రైమ్నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ

నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి దోపిడీకి పాల్పడింది. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో నేపాలీ ముఠా చోరికి పాల్పడింది. కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ ఇంట్లో పనికి చేరిన నేపాలీ జంట, పుట్టినరోజు వేడుకల నెపంతో ముఠా సభ్యులను పిలిపించింది. అనంతరం దంపతులపై దాడి చేసి వారి చేతులు కట్టేశారు. మత్తు మందు ఇచ్చి నగలు, విలువైన వస్తువులతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -