- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త ఆధార్ యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఎంఆధార్ యాప్ సేవలను నిలిపివేసి, దాని స్థానంలో ఆధార్ పేరుతో కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్లో QR కోడ్ ద్వారా ధృవీకరణ, ఫేస్ రికగ్నిషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇకపై ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా QR కోడ్ ద్వారా వివరాలు పంచుకోవచ్చు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు ధృవీకరణ పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల ఆధార్లను కూడా ఒకేచోట యాడ్ చేసుకోవచ్చు.
- Advertisement -



