ప్రజా సమస్యలకు పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి..

– నవతెలంగాణ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. దేశ నాయక్ .
నవతెలంగాణ- అచ్చంపేట: ప్రజల సమస్యలు ప్రచురించడానికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలని అందులో నవతెలంగాణ కు ప్రత్యేక గుర్తింపు ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ నాయక్ అన్నారు సోమవారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నాగర్ కర్నూల్ కల్వకుర్తి డివిజన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన పాల్గొని నేటి సమాజంలో పత్రికలు పాత్ర అంశంపై మాట్లాడారు. ఏదైనా ఒక ప్రాంతంలో సుదీర్ఘంగా ఉన్న ప్రజా సమస్యలను పత్రికల్లో ప్రచురించి ప్రభుత్వం సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ తెలంగాణ మేనేజర్ వాసు, ఉమ్మడి జిల్లా ప్రతినిధి పరిపూర్ణ,  డివిజన్ ఇంచార్జ్ లక్పతి నాయక్, స్థానిక రిపోర్టర్లు కాలురి శ్రీను, కేఎల్ నారాయణరావు, శ్రీశైలం ,లక్ష్మణ్, రమేష్ ,ప్రసాద్, పరమేశ్వర్, తదితరులు ఉన్నారు.
Spread the love