పంట పొలాలకు మట్టి పర్మిషన్ రోడ్లు..

నవతెలంగాణ -రేవల్లి
గౌరీదేవి పల్లి గ్రామంలో నేడు గ్రామస్తులు పంట పొలాలకు మట్టి పర్మిషన్ రోడ్డు కార్యక్రమాలు చేపట్టారు.  గతంలో మంత్రి  నిరంజన్ రెడ్డికి  పంట పొలాల కు వెళ్లడానికిి ప్రధానమై రోడ్డు దారి లేనందున  విషయం పై గ్రామస్తులు పంట పొలాలకు వెళ్లడానికి మంత్రి దీనిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరగా,  మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో హామీీ ఇచ్చారు,  ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గ్రామస్తులు మంత్రి నిరంజన్ రెడ్డి కి రుణపడి ఉంటామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు రైతులు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండాా వెళ్లిపోయేవారు అని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరిదేపల్లి గ్రామం బాగా అభివృద్ధి చెందింది అని గ్రామస్తులుు తెలిపారు, మళ్లీ వచ్చే ప్రభుత్వంంలో నిరంజన్ రెడ్డి  గెలవాలని గ్రామస్తులుు తెలిపారు, దీంతో సర్పంచ్ పార్వతమ్మ కొత్త బాటల కోసం ” మట్టి పర్మిషన్ రోడ్డు కార్యక్రమాలు ” మొదలుపెట్టారు. పిల్లిగుండ్ల రోడ్డు రెండు కిలోమీటర్ల వరకు మరియు లింగమోని రోడ్డు ( 1 ) కిలోమీటర్ వరకు, మరో రోడ్డు కొరుపాల నుంచి గన్యాగుల దారికి ఒక కిలోమీటర్ వరకు రోడ్డు కార్యక్రమాలుు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్వతమ్మ భర్త ” తిరుపతయ్య”, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, ముఖ్య నాయకులు శశింధర్ రెడ్డి, నారం రెడ్డి, సురేందర్ రెడ్డి, బొందయ్య, రామకృష్ణ, మహేష్, ప్రెసిడెంట్ రామకృష్ణ, నీలావర్ధన్, మాధవ్, యాతం మాసయ్య, కొరపాల కృష్ణ, శ్రీను, ఆంజనేయులు, రాజు, శంకర్, లక్ష్మయ్య, వెంకటయ్య, మల్లేష్, బాలయ్య, సతీష్, వార్డ్ మెంబర్లు సత్యం, శంకర్, ఈర్ల రేణుక, భాగ్యమ్మ, సుగుణమ్మ, జి తిరుపతమ్మ, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love