రాష్ట్రంలో 191కి చేరిన నామినేషన్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 191 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యల్పంగా అదిలాబాద్‌ స్థానంలో నలుగురు నామినేషన్‌ దాఖలు చేయగా, అత్యధికంగా భువనగిరిలో సీపీఎం అభ్యర్ధి జహంగీర్‌తో పాటు మొత్తం 18 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలోని చాలా నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ నెల 25 చివరి రోజు కావడంతో బుధ, గురువారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Spread the love