25వేల యువతకు హెచ్‌సీసీబీ నైపుణ్య శిక్షణ

న్యూఢిల్లీ : దేశంలోని 25,000కు పైగా యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) తెలిపింది. ఎనిమిది రాష్ట్రాల్లోని యువతకు విక్రయాలు, మార్కెటింగ్‌కు సంబంధించి అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పేర్కొంది. వై4డి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించినట్టు వెల్లడించింది.

Spread the love