– సింగపూర్, హాంకాంగ్ నిషేధంతో..
న్యూఢిల్లీ : భారత్కు చెందిన రెండు కంపెనీల మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని.. వాటిని నిషేధిస్తున్నామని సింగపూర్, హాంకాంగ్ ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాల తయారీ కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ఆ రెండు కంపెనీలకు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్లను ఆదేశించింది. అదే విధంగా దేశంలోని అన్ని మసాల దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.