మగ్గిడి గ్రామంలో వ్యవసాయ పంటల పరిశీలన

నవతెలంగాణ -ఆర్మూర్  

మండలంలోని  మగ్గిడి గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి హరికృష్ణ పంటలను పరిశీలించటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయాబీన్ పంటలో చేపట్టే సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించటం జరిగింది ..ముఖ్యంగా సోయాబీన్ పంటలో పల్లాకు తెగులు ఉత్పత్తిని రైతులు గమనించవలెనని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దపల్లి శ్రీనివాస్, రైతులు చిన్నారెడ్డి, సుమన్, భూమన్న, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love