విద్యుత్ఘానికి గురై ఒకరు మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ఘాతానికి  గురై ఓ తాపీ మేస్త్రీ మృతి చెందిన ఘటన జరిగింది. స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా రౌతం పూడి మండలం బలరామ పురం కు చెందిన దాసరి సూరిబాబు(40) తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.కాగా కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట కు చెందిన తాపీ మేస్త్రీ పీ లక్ష్మణరావు,ఆశ్వారావుపేట లో ఓ భవన నిర్మాణ పనులు చేసేందుకు సూరిబాబు తో పాటు కొద్దిమంది కార్మికులను తీసుకొచ్చాడు.వీరంతా స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నివాసం ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి పని ముగిసిన తర్వాత సూరిబాబు స్నానం చేసి తడిసిన టవల్ ను ఫీల్లర్లుకు కట్టిన ఉన్న మోటరు వైరుపై ఆరేస్తుండ గా ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కింద పడిపోయాడు.గమనించిన తోటి కూలీలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికు తరలించగా వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి అన్నయ్య దాసరి అప్పన్నబాబు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love