గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని అర్గుల్ గ్రామ శివారులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనగా వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు.  తేది: 02.06.2024 నాడు అందజా ఉదయం 05 గంటలకు ముందు సమయంలో అర్గుల్ గ్రామా శివారులోని మైత్రి గార్డెన్ ముందర రోడ్ దాటుతున్న గుర్తు తెలియని మగ వ్యక్తిని హైదరాబద్ నుండి ఆర్మూర్ వైపుకు వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం టక్కర్ ఇవ్వటంతో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే చనిపోయినాడు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంబించనైనదని ఎస్సై తెలిపారు.
Spread the love