బైకును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరికీ గాయాలు

– కేసు నమోదు చేసిన జక్రాన్ పల్లి పోలీసులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
బైకును ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలైనట్టు ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన పైడి రఘు అతని తండ్రి ఇద్దరు కలిసి బైక్ పైన డిచ్పల్లికి వెళ్లి, తిరిగి వస్తున్న తరణంలో పడకల్ తండా వద్ద బైకు వెనుక నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో బైకు పైన ప్రయాణిస్తున్న పైడి రఘు అతని తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. రఘు తల్లి పైడి మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Spread the love