– మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఆగి ఉన్న లారీని బైకు ఢీకొనడంతో ఒకరి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. ఉదయం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహామీర్ తండా కు చెందిన జాదవ్ సుధాకర్, అతని భార్య శిరీష ఇద్దరు తమ బైక్ పై జాతీయ రహదారి 44 మీదుగా వస్తుండగా జక్రంపల్లి బ్రిడ్జి దగ్గర ఆగి ఉన్న లారీకి వెనకనుంచి గుద్దుకొని ప్రమాదానికి గురయ్యారు. ఇట్టి ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య శిరీషను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినైనది. ఇట్టి విషయంలో లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్సై తిరుపతి తెలిపారు.