శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్ధిపేట మన లక్ష్యము

– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట
శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్ధిపేట మన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట బస్టాండులో గురువారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీపీఓ దేవకి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సులతో కలిసి రాష్ట్రంలోనే తొలి రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు, క్లాత్ ప్యాడ్ ఔట్ లెట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పుల ద్వారా నెలసరి సౌకర్యం, ఆరోగ్యం బాగుంటుందని అవగాహన కల్పించాలని కోరారు. ఆశాకార్యకర్తలు, ఏఏన్ఏం, అంగన్ వాడీ, ఆర్పీలు సమన్వయంతో ముందుగా పట్టణంలోని 5 మున్సిపల్ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకునెల చొరవ చూపాలని ఆదేశించారు. ఈ మేరకు రుతుప్రేమ ఫోటో గ్యాలరీని తిలకించారు.
సంబరంగా చేపల పండగ..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, ఎక్కువ చేపలు ఉత్పత్తి పెరిగిందని, చేపల పండుగను సంతోషంగా జరుపుకుందామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ , మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, కనకరాజు, శ్రీహరి,
బాలలక్ష్మి ఆనంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Spread the love