వడగండ్ల వర్షానికి నేలకొరిగిన వరి పంట

నవతెలంగాణ – రెంజల్

శనివారం రాత్రి పెండ్యాల మండలంలో వడగళ్ల వర్షానికి దూపల్లి గ్రామానికి చెందిన రైతు శేషు గారి గంగారెడ్డి మూడు ఎకరాల పొలం నేలకొరిగిందని పెంజల్ మండల వ్యవసాయ అధికారి లక్ష్మి కాంత్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలో జూపల్లి గ్రామం మీదుగా వడగళ్ల వర్షం వెళ్లిందని మిగతా మండలంలో వారికి ఇలాంటి హాని జరగలేదని ఆయన తెలిపారు. చేతికి వచ్చిన పంట నేలపాలయ్యిందని రైతు రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం పై మండలంలో మూడు ఎకరాల వరి పంటను సంబంధిత అధికారులకు నివేదిక నంద చేయడం జరిగింది ఆయన పేర్కొన్నారు.
Spread the love