దుబ్బాకలో ఘనంగా పన్యాల జన్మదిన వేడుకలు

నవతెలంగాణ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వారికి కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అంతక ముందు ఆయన పుట్టినరోజు సందర్బంగా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు.  అనంతరం 6 లక్షల రూపాయలను ఆలయానికి విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వారికి ఆలయ ఛైర్మెన్ వడ్లకొండ శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నక్క వెంకన్న, అందే రాజిరెడ్డి, ఏలూరి కమలాకర్, సంజీవరెడ్డి, అమ్మన శ్రీనివాస్ రెడ్డి, గున్నాల సాయి క్రిష్ణ గౌడ్, జింక కనకయ్య, దండబోయిన శ్రీనివాస్, నవీన్, కిట్టు గౌడ్ , ఏదుల్ తదితరులున్నారు.
Spread the love