నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమానేశాలు ఆగస్టు 11 వ తేదీ వరకూ జరుగుతాయి. ముందు పాత పార్లమెంట్ భవనంలోనే ఆరంభమయ్యే ఈ సెషన్ తరువాతి దశలో కొత్త పార్లమెంట్‌లోకి మారుతుంది. లోక్‌సభ సచివాలయం తెలిపిన వివరాల మేరకు ఈసారి 21 కొత్త బిల్లులు, ఏడు పాత బిల్లులను చర్చకు జాబితాలో పెట్టినట్లు వెల్లడైంది. ఇందులో డిజిట్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు , అటవీ పరిరక్షణ సవరణల బిల్లు , జన్‌విశ్వాస్ బిల్లు , ఎస్‌సి ఎస్‌టి సవరణల బిల్లు వంటివి ఉంటాయి. మణిపూర్ పరిస్థితిని , ధరల పెరుగుదల విషయాలను విపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తాయి.

Spread the love