కందుకూరి సోమయ్యను పరామర్శించిన పిడమర్తి రవి

నవతెలంగాణ-తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పట్టణంలో ఎన్ ఎస్ యూ ఐ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ తండ్రి  కందుకూరి సోమయ్య (మాజీ సర్పంచ్) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు  విషయం తెలుసుకున్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి శుక్రవారం కందుకూరి సోమయ్యను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చెడే మహేందర్ , యూత్ కాంగ్రెస్ నాయకులు పేరాల నరేష్  ,మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love