తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

నవతెలంగాణ – తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికుల తో 19 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేనియాత్రికుల 10 నుంచి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,830 మంది యాత్రికులు దర్శించుకోగా 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.20 ఆదాయం వచ్చిందని తెలిపారు.

Spread the love