- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిన్న సేవా తీర్థ్లో అంతరిక్ష రంగానికి చెందిన 20 స్టార్టప్ల సీఈవోలు, వ్యవస్థాపకులతో సమావేశమై, భారత్లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం, కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం పెట్టుబడుల కేంద్రంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



